VSP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గాజువాక చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఉడాకాలనిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగానే అంబటి రాంబాబును కలిసేందుకు తరలివచ్చారు. అంబటి రాంబాబు, కర్ణం ధర్మశ్రీ కొంతసేపు పార్టీ విషయాలు, ఇతర అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం.