గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన నైట్ షిఫ్టులు, క్యాజువాలిటీ, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ల విధులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.