ADB: బోరజ్ మండలంలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్యాసింజర్లతో పాటు ఇతర సామాగ్రితో అధిక లోడుతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.