TG: పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయని నాంపల్లి బోర్డు అధికారులు వెల్లడించారు. 2,676 కేంద్రాల్లో 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్), సైన్స్ మినహా పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లు వెబ్సైట్, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండగా, నాంపల్లిలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.