ఎక్కువ వాల్యూమ్తో మ్యూజిక్ వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. వినికిడి నష్టం కలగకుండా ఉండాలంటే హెడ్ ఫోన్ వంటి వ్యక్తిగత ఆడియో పరికరాలను 60 శాతం కంటే తక్కువ శబ్ధంతో ఉపయోగించాలి. అలాగే, ఒక గంట ఉపయోగించిన తర్వాత విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. యువత అధిక శబ్ధంతో సంగీతం వింటూ ఉంటారు. దీని వల్ల వినికిడి నష్టం ఎక్కువగా ఉంటుంది.