AP: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ మరణించింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికాగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సూర్యకళ ప్రాణాలు వదిలింది. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది.