నంద్యాల జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో డీఎంహెచ్వో డాక్టర్ ఆర్. వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలు తమ వినికిడి సమస్యలను తల్లిదండ్రులకు వివరించలేరని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా సత్వర చికిత్స కేంద్రంలోని వైద్యాధికారులను సంప్రదించి పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించాలన్నారు.