SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పంచాయితీ సీతంపేటలో గ్రామీణ రోజ్ గార్ యోజన పనులను రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు.