ATP: బెలుగుప్ప మండలం నక్కనపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెలుగుప్పకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.