నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, ఆళ్లగడ్డ ఎస్డీపీవో ఆదేశాల మేరకు రుద్రవరం పోలీసులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వివిధ మండలాల్లో రైతుల బోర్ల వద్ద విద్యుత్ వైర్లను కట్ చేసి దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ డీ. రాము వెల్లడించారు.