VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరళ్ శ్రీవాస్తవ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.