సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్లిస్ట్లో ఉంది.