భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గడువు ముగిసిన మందులపై నిఘా ఉంచాలని, గర్భిణీలకు అన్ని పరీక్షలు ఆసుపత్రిలోనే చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.