VZM: శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ సుదర్శన నారసింహస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం శ్రీ విష్వక్సేన ఆరాధన, యాగశాలార్చన, మంగళాశాసనమ పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ జరిగిన ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.