BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.