TG: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ వెంట డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి ఉన్నారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత దేశంగా మార్చడంపై చర్చిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్ జీ సహా పలువురు నేతల లొంగుబాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం.