NLG: శాలి లింగోటం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోనేటి అఖిల్, లోడే ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.