NLR: రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం గుడ్లూరు మండలం కర్లపాలెంలో R&R కాలనీ నిర్మించారు. దీనిని మంత్రి BC జనార్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.40 కోట్లతో ఈ కాలనీ నిర్మాణం జరిగింది. పోర్టు నిర్వాసితులకు ఈ కాలనీలో పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, MLA ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.