MHBD: కేంద్ర ప్రభుత్వం మహిళా కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న మహబూబాబాద్లో నిర్వహించే శ్రామిక మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణవేణి కోరారు. బుధవారం సభకు సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. మహిళా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.