ASR: అడ్డతీగల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ మహేష్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఇతర వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.