SRCL: సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన కోనమ్మ శ్రీనివాస్-అమరావతి కూతురు వివాహానికి తన వంతు సహాయంగా ఆ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిని-నరేష్ 50 కిలోల బియ్యం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి పేదింటి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోర రవి, కోడం శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, రాజయ్య, కృష్ణా హరి, మధు, అభిలాష్ పాల్గొన్నారు.