KMM: కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన గోపాలపురం వాసి షేక్ నాగుల్ మీరా (65) శుక్రవారం సాగర్ కాలువలో మృతి చెంది కనిపించారు. టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాలువ నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.