NRML: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్న డిమాండ్ చేశారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కరువుభత్యం రూ.5.50 పెరగడంతో ప్రతి 1000 బీడీలకు రూ.268.31 చెల్లించాలన్నారు.