PLD: నేడు వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేని ఏ కార్యక్రమానికైనా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎవరైనా నేర చరిత్ర కలిగిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.