GNTR: రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బలంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. బుధవారం అసెంబ్లీలోని జనసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా అసెంబ్లీని ఉపయోగించుకోవాలన్నారు.