NLR: సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుంతుంది. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 21, 947 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 69. 390 TMCల నీటిమట్టం నమోదైంది. రైతుల అవసరాల కోసం పెన్నా డెల్టాకు 1,850, కండలేరుకు 6,450 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.