VZM: ఇండియాపై ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ శనివారం పట్టణంలో వామపక్ష పార్టీలు నిరసన తెలియజేశాయి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, భారత్ ఎగుమతులపై విధించిన సుంకాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారత్ విదేశాంగ విధానంపై ట్రంప్ పెత్తనం నశించాలని, భారత్ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.