NLR: బుచ్చి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈఓ దిలీప్ కుమార్, టీడీపీ నేత దొడ్ల కోదండయ్య పరిశీలించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులతో మమేకమై వారితో కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు.