MNCL: రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధు గురించి స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇంతవరకు రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ సగకాలం పూర్తయిన రైతుబంధు డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. రైతులకు రైతుబంధు డబ్బులు చెల్లించాలని ఆయన కోరారు.