KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఉపాధి పనుల వద్ద ‘ఈ-కేవైసీ’ నమోదు కాకపోవడంతో బుధవారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వేచి చూశాక ఈ కేవైసీ రావడం లేదని అధికారులు తమను వెనక్కి పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పేర్కొన్నారు.