NLG: చంద్రగ్రహణం ముగియడంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ బుధవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. నిన్న మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:49 గంటల వరకు కొనసాగింది. దీంతో ఆగమ శాస్త్రం ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచే ఆలయ ద్వారాలను మూసివేసిన అర్చకులు, ఈరోజు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.