చిత్తూరు డీఐ రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వామివారికి మంగళహారతి సమర్పించారు. అనంతరం నిర్వహించిన స్వామి వారి లడ్డూ వేలం పాటలో ఎమ్మెల్యే లడ్డూను రూ.4 లక్షలకు కైవసం చేసుకుని భక్తులకు పంచిపెట్టారు.