GNTR: కొల్లిపర మండలం చక్రాయపాలెం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలుమూరు రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా తెనాలికి ఇసుకను తరలిస్తుండగా, ఎస్సై ప్రసాద్ తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకున్నారు. కొత్త చిలుమూరు, అన్నవరపు లంక గ్రామాలకు చెందిన ఈ ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేశారు.