SKLM: రాష్ట్రంలో నిర్మితమవుతున్న విజయవాడ విమానాశ్రయ టెర్మినల్, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు డిల్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శర వేగంగా భోగాపురం, విజయవాడ విమానాశ్రయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఆయన కీలక సూచనలు చేసారు.