WNP: ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన ఉప్పరి కేశవులు మృతిచెందగా, ఆయన భార్య వనజ గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం HYDలోని ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు.