SRCL: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోనీ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊయాలలో ఉంచి జోల పాటలు పాడుతూ పూజలు చేశారు. స్వామిని దర్శించుకొని భక్తులు పూజలు చేశారు.