సీనియర్ జర్నలిస్ట్ మూర్తిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘ఆయనకు తగిన శాస్తి జరిగింది’ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనకు ఇలాంటి చర్యలు అవసరమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.