ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పాతూరులో గురువారం తెల్లవారుజామున వినాయక మండపం వద్ద ఉన్న హుండీని గుర్తుతెలియని దుండగులు తీసుకువెళ్లారని గణేష్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం పారిశుద్ధ కార్మికులు గణేష్ మండపం వద్ద శుభ్రం చేస్తుండగా గమనించినట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల కాలంలో పాతూరులో దొంగతనాలు ఎక్కువైతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.