WGL: గీసుకొండ (M) కేంద్రంలోని కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతర సందర్భంగా రహదారులపై దుమ్ము ఎగరకుండా ముందస్తు జాగ్రత్తగా ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీళ్లు చల్లిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.