KNR: ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిట్ఫండ్ మోసాలను అరికట్టి బాధితులకు న్యాయం చేయాలని KNR CP గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో శనివారం జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో అడిషనల్ DCP, ACPలు, SIలు, SHOలు పాల్గొన్నారు. అక్రమాల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.