KDP: సీ.కే దిన్నెలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎస్సై శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేసి విజయాన్ని సాధించాలని ప్రేరేపించారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.