KNR: నగర శివారులోని రేకుర్తిలో తప్పుడు సర్వే నంబర్లతో భూఆక్రమణలు యత్నించిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూ పరిధిలోని 18వ డివిజన్లో సర్వే నంబరు 227లో తన పేరిట ఉన్న భూమిని కొంతమంది తప్పుడు సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నించినట్లు కరీంనగర్కు చెందిన అబూబకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.