SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్లాట్ల లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం 25% రాయితీ గడువును ఈనెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25% రాయితీ గడువును ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.