SRD: సంగారెడ్డి మండలం ఫసల్వాది విద్యాపీఠంలో జల లింగ నిర్మాణ పనులను మంగళవారం రాత్రి పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి పరిశీలించారు. జల లింగార్చనలో భాగంగా 1008 నదుల తీర్థం జలాలతో నిర్మిస్తున్నారు. వచ్చే శివరాత్రి రోజు అత్యంత వైభవంగా నిర్వహించే జల లింగార్చనలో భాగంగా, నిర్మించే జల లింగ నమూనాలను ఆర్కిటెక్చర్ మంగారావు పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు.