SRD: జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలు, పదోన్నతి పై బదిలైన కలెక్టర్ వల్లూరు క్రాంతికి మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఒక్కొక్క ఎంపీడీవో పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. జిల్లాలో పరిపాలన యంత్రాంగాన్ని అన్ని విధాల సమర్థవంతంగా నడిపించిన వల్లూరు క్రాంతికి జ్ఞాపికను అందజేస్తూ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.