VZM: బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ మంగళవారం మండలంలోని దెబ్బగుడ్డివలసలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి, ఇప్పటి వరకు జరిగిన వసూళ్లపై సంతృప్పి వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా వంద శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.