PLD: బుధవారం తెల్లవారుజామున నరసరావుపేట వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బూదాల కళ్యాణ్ ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా పోస్టులు, కార్యకలాపాలపై సమాచారం ఆధారంగా వివరణ కోరుతూ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.