మందస మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యవ్వారి నారాయణరావు 28 సంవత్సరాలు ఆర్మీలో సేవలు అందిస్తూ… నేడు లెఫ్టినెంట్ హోదాలో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుదీర్ఘకాలం ఆర్మీలో పనిచేస్తూ దేశ సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.