MNCL: బెల్లంపల్లి శాంతిఖని గనిలో కార్మికులకు తాగేందుకు గుక్కెడు నీరు కరువైంది. గనిలో నిర్మించిన RO ప్లాంట్ చెడిపోయింది. దీంతో కార్మికులు తాగునీటి సదుపాయం లేక నరకాయతన పడుతున్నారు. ఇంటి వాటర్ బాటిళ్లను వెంట తెచ్చుకుని దప్పిక తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు RO ప్లాంట్ ఏర్పాటుపై దృష్టి సారించాలి. అప్పటివరకూ తాత్కాలిక తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.