ప్రకాశం: పుల్లలచెరువు రంగన్న పల్లి గ్రామంలో 220కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సబ్స్టేషన్ నిర్మించడం వల్ల లో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు